ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బ‌దిలీ

-

ఏపీ ప్రభుత్వం భారీగా ఐపీఎస్‌ బదిలీలు చేపట్టింది. ఈ మేరకు 14 మందిని బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం మంగ‌ళ‌వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవ‌ల ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి అనంత‌పురం పోలీసులు కొజ్జాలు అని విమ‌ర్శ‌లు గుప్పించి, వివాదాస్ప‌ద‌మైన త‌రుణంలో అనంత‌పురం ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ను మాత్రం క‌దిలించ‌లేదు. ఎస్పీని మార్చాల్సిందేన‌ని జేసీ సీఎం వ‌ద్ద ప‌ట్టుబ‌ట్టిన‌ప్ప‌టికీ, మెజార్టీ ఎమ్మెల్యేలు ఆ ఎస్పీనే కొన‌సాగించాల‌ని కోర‌డంతో చివ‌ర‌కు సీఎం ఎమ్మెల్యేల వాద‌న‌తోనే ఏకీభ‌వించారు.

Read more RELATED
Recommended to you

Latest news