బాబు పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చ మీడియా కిందా మీదా పడుతోంది: విజయసాయిరెడ్డి

-

టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్విటర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఇటీవల జరిగిన ఆదాయపన్ను శాఖ సోదాల్లో రూ.2 వేల కోట్లు దొరికాయని వైసీపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఆరోపణలు అవాస్తవమని ఐటీ పంచనామా నివేదిక ద్వారా బయటపడిందని, రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం దొరికినట్టు ఐటీ శాఖ పంచనామా తేల్చిందని వచ్చిన వార్తలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

‘చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చ మీడియా కిందా మీదా పడుతోంది. ఇన్ కంటాక్స్ కమిషనర్ సురభి అహ్లూవాలియాను కూడా దూషించే స్థాయికి వెళ్లి పోయింది. 2,000 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తిస్తే.. కాదు రెండు లక్షల నగదు మాత్రమే దొరికిందని అబద్ధపు ప్రచారం మొదలు పెట్టింది’ అని విజయసాయిరెడ్డి ఆయ‌న ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news