మరికొన్ని గంటల్లో పోలింగ్.. ఏపీఎస్ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు ఫోన్

-

మరికొన్ని గంటల్లో పోలింగ్ మొదలు కానున్న వేళ ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమలరావుకు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేశారు.రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు వస్తోన్న ఓటర్లకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

పట్టణాల నుండి జిల్లా ప్రాంతాలకు అదనంగా బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఓటు వేసేందుకు వస్తోన్న ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు చంద్రబాబు.ఇక, ఏపీలో ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు పోలింగ్‌కు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్ సభ సీట్లుకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4 న ఫలితాలు వెలువడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version