BREAKING :మహాత్మగాంధీపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు..వారసత్వ రాజకీయాలు ప్రమాదం !

-

దేశ ప్రధాని నరేంద్ర మోడీ… మహాత్మా గాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ సైతం కాంగ్రెస్ పార్టీని కోరుకోలేదని… అసలు వారసత్వ రాజకీయాలు దేశానికే ప్రమాదకరమని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్ అర్బన్ నక్సలైట్ల మాదిరిగా ఉందని నిప్పులు చెరిగారు. అటు కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి ప్రధాని మోడీ కౌంటర్‌ ఇచ్చారు…

కాంగ్రెస్‌ లేకుంటే దేశంలో ఎమర్జెన్సీ ఉండేది కాదు.. సిక్కుల ఊచకోత జరిగి ఉండేది కాదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రపంచం ఈస్థాయిలో మహమ్మారిని ఎప్పుడూ చూడలేదన్నారు. కరోనా కట్టడికి హెల్త్ వర్కర్లు ఎంతో కృషి చేస్తున్నారు, కరోనాపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని వెల్లడించారు. కరోనా కష్టకాలంలో కూడా అత్యధిక స్థాయిలో పంట కొనుగోలు చేశాం, అత్యధిక వృద్ధిరేటు సాధించామని ప్రకటన చేశారు ప్రధాని మోడీ.ఇక ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు నిరసనగా.. కాంగ్రెస్‌ పార్టీ నేతలు సభ ను వాకౌట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news