బలంగా మారనున్న ప్రియదర్శి బలగం.. విడుదలకు ముందే సక్సెస్..!

-

జబర్దస్త్ కమెడియన్ గా ఒకప్పుడు మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా.. దిల్ రాజు నిర్మించిన సినిమా బలగం.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. మార్చి 3వ తేదీన రిలీజ్ అవుతుండగా తాజాగా ప్రీమియర్ షో ని ఏర్పాటు చేశారు. ఈ ప్రీమియర్ షో చూసిన కొంత మంది సినీ ప్రముఖులు సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. సరదాగా నవ్విస్తూ.. ఏడిపిస్తూ సినిమా ఆద్యంతం ఆకట్టుకుందని తెలిపారు. బలగం సినిమాతో కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారిపోయారు. ఆయన చెప్పిన కథ నచ్చి దిల్ రాజు నిర్మించడం జరిగింది. అయితే కథ చెప్పినట్టుగా సినిమా తీయడం అన్ని సందర్భాలలో కుదరదు.. కానీ ఈ విషయంలో వేణు సక్సెస్ అయ్యారని తెలుస్తోంది.

నిన్నటి వరకు వేణుని ఒక కమెడియన్ గా మాత్రమే చూడగా బలగం సినిమా తర్వాత ఆయన ఒక గొప్ప దర్శకుడిగా గుర్తిస్తారని సమాచారం. సినిమా విడుదలకు ముందే ప్రీమియర్ షో తో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ప్రేక్షకులు ఈ సినిమా చూసి ఎలాంటి రిజల్ట్ అందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇకపోతే ఈ సినిమా విషయంలో దిల్ రాజు ప్రమోషన్స్ కూడా ఆడియన్స్ కు దగ్గర అయ్యేలా చేస్తున్నారు.

మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కేటీఆర్ కూడా హాజరై సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. మొత్తానికైతే ఈ సినిమాకు పెద్దపెద్ద వాళ్ళ అండ బలంగా మారుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే సక్సెస్ టాక్ అందుకుంది అంటే అటు డైరెక్టర్గా వేణుకు.. ఇటు హీరోగా ప్రియదర్శికి ఇద్దరికీ మంచి లైఫ్ వచ్చినట్లే అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version