కేసీఆర్ సర్కార్ పై ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు

-

కేసీఆర్ సర్కార్ పై ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. నార్కట్ పల్లిలో ప్రో కోదండరాం కృష్ణ జలాల పరిరక్షణ యాత్రలో భాగంగా వాసవి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఈ రోజు కృష్ణ బోర్డ్ సమావేశం కాబోతుంది. ఈ సమావేశ్మలో శ్రీశైలం, నాగార్జునసాగర్ లో ఉన్న 15 ఔట్ లెట్స్ కావాలని అడుగుతున్నారని.. ఆర్డీఎస్ 15.9టీఎంసీల రావాలి కానీ సగం కూడా రావడం లేదు. ఈ అంశంపై ఇప్పటికీ కూడా మనకు న్యాయం చెయ్యలేక పోయింది. తప్పని సరిగా కృష్ణ బోర్డ్ ఆర్డీఎస్ విషయంలో తెలంగాణ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ కు 811 టీఎంసీలకుకు గాను 299 టీఎంసీ కేటాయిస్తూ తాత్కాలిక కేటాయింపు ఇస్తున్నారు. కృష్ణలో గోదావరి నీళ్లను కలుపుతున్నారు కానీ అందులో మన వాటా ఇవ్వడం లేదని.. ఈ రోజు కృష బోర్డ్ సమావేశంలో తెలంగాణకు న్యాయ సంభతమైన వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రని కోట్లాది తెచుకుందే నీళ్లు నిధులు నియామకాలు కానీ ఇప్పటికి నీటి విషయంలో మనకు న్యాయ సంబంధమైన వాటా దక్కలేదని.. మన హక్కు కోసం ఎన్నడూ రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడింది లేదని మండిపడ్డారు. సత్వరమే కృష్ణ నది కింద పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ పూర్తి చేయాలి… రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జరిగే సమావేశంలో కృష్ణ ట్రిబ్యునల్ ముందు మనకు రాబోయే వాటా ని సాధించే విధంగా కొట్లాడలని పేర్కొన్నారు ప్రొఫెసర్ కోదండరాం.

Read more RELATED
Recommended to you

Latest news