నయా నిజాంకు బీజేపీ సత్తా చూపిస్తాం.. కేసీఆర్‌కు రాజాసింగ్‌ వార్నింగ్‌

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ పేర్కొన్నారు. బండి సంజయ్ ‘జాగరణ’ కారులో వెళుతున్న డాక్టర్ లక్ష్మణ్ ను దారిలో అడ్డగించి అరెస్టు చేయడం దారుణమని నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలపై మాట్లాడతామంటే అసెంబ్లీలో మైకులివ్వరు….. బయట నిరసన తెలుపుతామంటే కూడా నిర్బంధిస్తారా ? అని నిలదీశారు.

తెలంగాణలో నయా నిజాం రాక్షస పాలన కొనసాగుతోందనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి ? అని రాజాసింగ్‌ ప్రశ్నించారు. డిసెంబర్ 31న అర్దరాత్రి బార్లు, పబ్బులకు అనుమతి ఇచ్చినప్పుడు లేని కోవిడ్ రూల్స్ ఈరోజు గుర్తుకొచ్చాయా ? అని రాజాసింగ్‌ నిలదీశారు. గంగుల కమలాకర్ వంటి తలకాయ మీద మెడకాయ లేని మంత్రి అని… అలాంటి వ్యక్తి కోవిడ్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని చురకలు అంటించారు. కేసీఆర్ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గరపడ్డట్లే…. బీజేపీ సత్తా ఏందో ఈ నయా నిజాంకు రుచి చూపిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు రాజాసింగ్‌.

Read more RELATED
Recommended to you

Latest news