‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి బిగ్‌ అప్డేట్‌.. ట్రైలర్‌ రిలీజ్‌ అప్పుడేనంట

-

మాస్‌ మహారాజ రవితేజ కథనాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. రవితేజకు జోడీగా దివ్యాన్ష కౌశిక్ .. రజీషా విజయన్ లు ఈ సినిమాలో నటిస్తున్నారు. రజీషా విజయన్ ఈ సినిమాతోనే తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. ఈ నెల 16వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలింది చిత్రయూనిట్‌.

1995లో జరిగిన యథార్థ సంఘటనల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాతో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇతర ముఖ్యమైన పాత్రలలో నరేశ్ .. పవిత్ర లోకేశ్ .. తనికెళ్ల భరణి నటించారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version