టీఆర్ ఎస్‌ చెరువు తెగింది..అంద‌రూ కాంగ్రెస్ లోకే వ‌స్తారు : రేవంత్‌

-

టీఆర్ ఎస్‌ చెరువు తెగింది..అంద‌రూ కాంగ్రెస్ లోకే వ‌స్తారని రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ.. నిత్య వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల పెంపున‌కు వ్య‌తిరేకంగా.. పాద‌యాత్ర నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. చేవెళ్ల గడ్డ..కాంగ్రెస్ అడ్డా అని.. మోడీకి… కెసిఆర్ నియంత విధానాలపై నిరసన గా రోడ్డెక్కామని పేర్కొన్నారు. స్థానిక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని… కాంగ్రెస్ లో నుండి పోయ్యేది లేదు… ఇక టీఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చే వాళ్ళే ఉంటారని స్ప‌ష్టం చేశారు రేవ‌త్ రెడ్డి.

అందరూ కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉండాల‌ని… కోరారు. గ‌తంలో… జేబు నిండా పైసలు తీసుకెళ్తే… సంచి నిండా కూరగాయలు వచ్చేవని.. కానీ ఇప్పుడు సంచి నిండా డబ్బులు తీసుకుపో తే జేబు నిండా కూడా కూరగాయలు రావట్లేన‌ని నిప్పులు చెరిగారు. సీఎం కెసిఆర్..మోడీ జనాన్ని మోసం చేశారని… మోడీ పేదల ఖాతా లో 15 లక్షలు ఎస్తా అన్నాడు.. 15 పైసలైనా వేశారా..? అని నిల‌దీశారు. ధాన్యం కొనుగోలు చేయ‌కుండా రెండు ప్ర‌భుత్వాలు.. మోసం చేస్తున్నాయ‌ని ఆగ్ర‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news