బీజేపీకి టీఆర్ఎస్ డబ్బులు పంపుతోంది.. అందుకే : రేవంత్‌ రెడ్డి

-

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మరోసారి బీజేపీ, టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. హోంమంత్రి స్థాయిలో అమిత్ షా మాట్లాడటం లేదని, సీఎం కేసీఆర్ అవినీతికి కంచె వేసి కాపాడుతోంది అమిత్ షానే అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంశాఖ కేసీఆర్ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించిన రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్ పై చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని… ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉత్తుతి మాటలు మాట్లాడుతున్నారన్నారు. బీజేపీకి టీఆర్ఎస్ డబ్బులు పంపుతోందన్న రేవంత్ రెడ్డి.. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా తెలంగాణ నుంచే డబ్బులు వెళ్తున్నాయని ఆరోపించారు.

KTR grabbed endowment lands: Revanth Reddy - Primepost

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా టీఆర్ఎస్ డబ్బులే వెళ్లాయని, సొంత పార్టీ నేతలపై కూడా సీబీఐ విచారణ జరిపిన బీజేపీ… కేసీఆర్ పై మాత్రం ఒక్క కేసు కూడా పెట్టడం లేదని మండిపడ్డారు రేవంత్‌ రెడ్డి, కేసీఆర్ పై ఉన్న సీబీఐ కేసులను ఎందుకు తొక్కి పెట్టారని, ఈఎస్ఐ కుంభకోణం కేసును ఎనిమిదేళ్లుగా తొక్కి పెట్టింది బీజేపీనే అని మండిపడ్డారు రేవంత్. కేసీఆర్ ను బీజేపీ బొక్కలో వేయకపోవడానికి కారణం… కేసీఆర్ వేసే బొక్కలేనని రేవంత్‌ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Read more RELATED
Recommended to you

Latest news