చేతికి ఎదిగిన కొడుకు ఇల్లరికం పోయినట్టు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాడు : రేవంత్ రెడ్డి

-

దొంగల్లాగా రాత్రిపూట మా ఆఫీస్ కార్యాలయం తగలబెట్టడం కాదు దమ్ముంటే మునుగోడు చౌరస్తా కొస్తాం రండి అని సవాల్‌ చేశారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. చేతికి ఎదిగిన కొడుకు ఇల్లరికం పోయినట్టు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాడని ఆయన వ్యాఖ్యానించారు. సీపీఎం పార్టీని దెబ్బడం పార్టీ అని కేసిఆర్ తిట్టిన ఆ పార్టీ నాయకులు టీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. దేవరకొండ సీపీఐ ఎమ్మెల్యేని టీఆర్ఎస్ లో చేర్చుకొని పార్టీ లేకుండా చేసిన సీపీఐ నేతలు కేసీఆర్ కి మద్దతు ఇచ్చారని, కమ్యూనిస్టు కార్యకర్తలు ఆలోచించి కాంగ్రెస్‌కు ఓటెయ్యండని ఆయన అన్నారు.

PM Modi insulted people of Telangana: Revanth Reddy

అంతేకాకుండా.. టీఆర్ఎస్‌, బీజేపీ రాజకీయ డ్రామాలాడుతున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీని లేకుండా చేయాలని టీఆర్ఎస్‌, బీజేపీ నాయకులు కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి..మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేస్తాడని ప్రశ్నించారు. శత్రువు దగ్గర చేరి.. తల్లి లాంటి కాంగ్రెస్‌ను చంపాలని రాజగోపాల్ రెడ్డి చూస్తున్నాడని తీవ్రంగా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే కమ్యూనిస్టులతో కేసీఆర్‌ పొత్తు పెట్టుకున్నాడని ఆరోపించారు. చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడం.. ప్రచారం కోసం ఉంచిన జెండాలు, పోస్టర్లు తగలబడడం అనుమానాలకు తావిస్తోందని.. టీఆర్ఎస్‌, బీజేపీ నేతలే ఈ ఘటనకు ఒడిగట్టి ఉంటారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news