కేసీఆర్‌ లేఖ రాయకపోతే..పీయూష్‌ గోయల్‌ గల్లా పట్టుకుని లాగే వాళ్లం : రేవంత్‌

-

కేసీఆర్‌ లేఖ రాయకపోతే..పీయూష్‌ గోయల్‌ గల్లా పట్టుకుని లాగే వాళ్లమని.. రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నీ మీద కత్తి పెడితే రైతుల హక్కులు రాసిస్తావా..? నీకు తుపాకీ పెడితే ఫామ్ హౌస్ రాసి ఇస్తావా..? అంటూ కేసీఆర్‌ కు చురకలు అంటించారు. ధాన్యం కొనుగోళ్లపై రేవంత్‌ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాళ్లతో కొట్టి చంపాలని.. గన్ పార్క్ దగ్గర రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారు.

వెంటనే తెలంగాణ రైతులకు కెసిఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అప్పుడు కాంగ్రెస్ ఏం చేయాలో అది చేస్తుందని.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దోపిడీని ప్రజలకు వివరిస్తామన్నారు. రేపు పార్టీ ముఖ్య నాయకులు మీడియా సమావేశాలు పెట్టి చైతన్యం చేస్తారని..మిలిటెంట్ పోరాటాలకు సిద్దం అవ్వండని పిలుపునిచ్చారు. టిడిపి ధరలు పెంచితే ఎలా పోరాటం చేసిందో అలాంటి పోరాటాలకు సిద్దం అవ్వాలని.. ప్రజలే నాయకులు అవ్వాలన్నారు.. మీ ముందు నేను ఉంటా.. లాఠీ..తూటాలు మేము ఎదుర్కొంటామని మాటిస్తున్నాని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news