పవన్‌ కళ్యాణ్‌ సంచలన నిర్ణయం..ఇక నుంచి ఆ కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయం

-

పవన్‌ కళ్యాణ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్న పవన్ కళ్యాణ్… ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జనసేన తరపువ ఆర్థిక సాయానికి నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు పంట నష్టాలు… అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమని.. అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాల్లోనే 80 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని పవన్‌ తెలిపారు. సాగును నమ్ముకొన్నవారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం అవుతోందని.. ఉగాది పూట ఆ కుటుంబాలు దుఖంతో, బాధతో ఉండకూడదు.. వారికి కొంతైనా ఊరటను ఇవ్వాలని పేర్కొన్నారు.

ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు జనసేన పక్షాన ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించామని.. ఒక్కో కుటుంబానికీ రూ.లక్ష రూపాయలు జనసేన ఆర్థిక సహాయం అందచేస్తుందని పవన్‌ ప్రకటన చేశారు. ఆ రైతు కుటుంబాలలోని పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు కొంతైనా అండ ఇవ్వాలనే రూ.లక్ష సాయం చేస్తున్నామని.. త్వరలోనే ప్రతి కుటుంబాన్నీ పరామర్శిస్తానన్నారు. ఆర్థిక సాయం అందించే ప్రక్రియ కూడా మొదలవుతుందని స్పష్టం చేశారు పవన్‌.

Read more RELATED
Recommended to you

Latest news