పోలీసు వాహనంపైకి ఎక్కి తాగుబోతు వీరంగం.. స్పందించిన రేవంత్ రెడ్డి!

-

తెలంగాణలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఘటనలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష నాయకులపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌లో ఓ తాగుబోతు పోలీస్ పెట్రోలింగ్ కారు ఎక్కి వీరంగం సృష్టించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ ఘటనపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

ఆసిఫ్‌నగర్‌లో పోలీసు వాహనంపై మందుబాబు ఎక్కి వీరంగం సృష్టించిన వీడియో వైరల్ అయింది. మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు దాటి.. పోలీసు వాహనంపై ఎక్కి.. అద్దాలు ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో వీడియోను షేర్ చేశారు. కాగా, స్థానికుల సాయంతో గంజాయి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో కొందరు తప్పించుకోగా.. అజయ్ అనే యువకుడిని అరెస్ట్ చేసి.. ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news