పవన్ కల్యాణ్‌కు ఆర్జీవి సూటి ప్రశ్న

-

జనసేనాని పవన్ కల్యాణ్‌కు వివాదాస్పదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సూటి ప్రశ్న వేశారు. విజయవాడలో వ్యూహం, శపథం చిత్రాలపై నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసల జల్లులు కురిపించారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ ఏం భ్రష్టు పట్టించారో? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పాలని ఆర్జీవి డిమాండ్ చేశారు.సీఎం జగన్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఆయన సవాల్ చేశారు. పవన్ చేస్తున్న విమర్శలకు అసలు ఆధారాలే ఉండవని రామ్ గోపాల్ వర్మ ఎద్దేవా చేశారు. ఆయన ఫ్యాన్స్ కూడా అవేమీ అడగరని అన్నారు. పవన్ వ్యాఖ్యలు తనకు ఇప్పటికీ అర్థం కావని వ్యాఖ్యానించారు.

కాగా, ఎన్నికల వేళ ఆర్జీవీ తెరకెక్కించిన చిత్రాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.జగన్‌కు రాజకీయంగా సాయం చేసేందుకే రాంగోపాల్ వర్ మ సినిమాలు తీస్తున్నారని ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు చేస్తుంది ఇక ఈ ఆరోపణల పై స్పందించిన రాంగోపాల్ వర్మ సీఎం జగన్ జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాల ఆధారంగానే సినిమాలు తీస్తున్నట్లు ,జగన్ అంటే ఏంటో ఇందులో చూపిస్తానని.. తాను నమ్మిన నిజాన్ని చెబుతానని వర్మ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version