చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను తరిమి, తరిమి కొడతారు – మంత్రి రోజా

-

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను తరిమి, తరిమి కొడతారని ఏపీ మంత్రి రోజా హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గర్జనను పక్క దోవ పట్టించేందుకే పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన అని ఫైర్‌ అయ్యారు. బావ,బామ్మరదులు అన్ స్టోప్పబుల్ గా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్టీఆర్ ను అవమానించి…మరణానికి కారణం అయ్యిన బాబు…ఈ రోజూ ఆరాధ్యదైవం అనడం సిగ్గుచేటన్నారు. ఉతరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ప్రజలు తరిమి కొడతారని మంత్రి రోజా వార్నింగ్‌ ఇచ్చారు. బినామీల పేర్ల పైన వున్న ఆస్తులను కాపాడుకోవడానికే చంద్రబాబు అమరావతిని రాజధాని చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు…పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు అమరావతి ఉద్యమాని చేయిస్తున్నాడని నిప్పులు చెరిగారు. దొంగ రైతులతో ఉద్యమాని నడుపుతూ ఉత్తరాంధ్రలో ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news