బ్రేకింగ్ :  ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్తాం : సజ్జల 

-

రాబోయే ఎన్నికలపై  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద నిన్న విలేకరులతో సజ్జల   మాట్లాడుతూ… మరో ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్తామని వెల్లడించారు. అంతేకాకుండా..  తమ ప్రభుత్వ పనితీరు ప్రజల్లోకి బాగా వెళ్లిందని, జగన్ అమలు చేసిన పథకాలు విజయవంతమయ్యాయన్నారు సజ్జల.  తాము మరింత బలోపేతమవుతున్నామని, ప్రజల్లో తమపై ఉన్న ఆదరణ మరింత పెరిగిందని సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు.

AP govt. advisor Sajjala Ramakrishna Reddy's brother passes away in  Hyderabad

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెబుతున్న పార్టీలన్నీ ఒక్కటై ఎన్నికలకు వెళ్తే వైసీపీ ఎదుర్కోగలదా? అన్న విలేకరుల ప్రశ్నకు సజ్జల మాట్లాడుతూ.. వారంతా కలిసి ఉన్నా, విడిపోయినా వారిది వాపు మాత్రమేనని, బలుపు కాదని మండిపడ్డారు సజ్జల. వారందరూ గతంలోనూ కలిసే ఉన్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు వారంతా కలిసే ఉన్నట్టు నమ్మిస్తారని, అధికారంలో లేనప్పుడు కలిసి బలం చూపించే ప్రయత్నం చేస్తారని   విమర్శించారు సజ్జల.

Read more RELATED
Recommended to you

Latest news