జగన్ కు సజ్జల బిగ్ షాక్.. వైసీపీ పథకాలను రోజూ విమర్శించండంటూ కామెంట్ !

-

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పథకాలను రోజూ విమర్శించండి తప్పులేదు…కానీ ఆధారాలుండాలంటూ అందరికీ షాకించేలా మాట్లాడారు. పేదలు సొంత కాళ్ళ మీద నిలవకూడదు అనేదే చంద్రబాబు ఆలోచన అని.. ఉంటే చంద్రబాబు ఉండాలి…లేదంటే రాష్ట్రం నాశనం కావాలి అనేది ఆ పత్రికల భావన అంటూ చురకలు అంటించారు. ప్రజలు వీళ్ళని చెత్తబుట్టలో పడేయాల్సిన అవసరం ఉందని.. వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే అలవిగాని హామీలన్నీ ఇస్తారన్నారు.

రైతు రుణ విముక్తి విషయంలో ఏమి జరిగిందో లక్ష కోట్లు…20 వేల కోట్లు ఎలా అయ్యాయో అందరికీ తెలుస అని.. మీడియా ముసుగులో దశబ్దాలు తరబడి టీడీపీ కోసం రౌడీయిజం, రుబాబు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వస్తే అంతా ప్రశాంతంగా ఉంటుందట… అవి ప్రచార సాధనాలు కాదు… విష ప్రచార సాధనాలు అంటూ మండిపడ్డారు.

వైజాగ్ స్టీల్ కేంద్ర ప్రభుత్వానిది…మనకు దానితో చరిత్రాత్మక బంధం ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సలహాలు కూడా ఇచ్చిందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆ గట్టా…ఈ గట్టా…? మేమైతే బీజేపీతోనే ఉన్నారని అనుకుంటున్నామని చురకలు అంటించారు. మోడీ కి ఒక వినతి ఇచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి.. అఖిలపక్షం పిలవకపోతే ఎదో జరిగినట్లు ఆందోళన చేయడం ఏమిటి..? అని ప్రశ్నించారు. ప్రతిపక్షం ఒక వ్యవస్థను అడ్డుపెట్టుకుని నడిచింది గతంలో ఎన్నడూ లేదని.. ఏడా పెడా కేసులు వేయడం వల్ల వ్యవస్థలో సమస్యలు వస్తున్నాయన్నారు. అన్నిటికీ న్యాయం జరిగేలా ఉండేందుకు కొన్ని నిర్ణయాలు వెనక్కు తీసుకున్నామని.. మహిళా పోలీసులు రెండు శాఖల మధ్య సమస్య… అందుకే పూర్తిగా వాళ్ళకి చట్టబద్దత కల్పించేందుకు మా  ప్రయత్నం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news