Samantha: “గుర్తు పెట్టుకోండి..ఇక మంచి జరగబోతుంది “..సమంత పోస్ట్ వైరల్..!!

-

Samantha: సమంత..అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. చెయ్ జ్ఞాపకాల నుంచి నెమ్మదిగా బయటపడేందుకు.. సమంత ఎక్కువ‌గా ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తోంది. ఆధ్యాత్మిక‌ పర్యటనలు చేసింది. పలు పూజలు నిర్వహించింది.
అలాగే.. గత కొన్ని రోజులుగా ఇంట్రస్టింగ్ కోట్స్ తో త‌న అభిమానుల‌ను ప‌ల‌కరిస్తుంది.

కొన్ని కోట్స్ చాలా ఎమోష‌న‌ల్ గా ఉన్నాయి. త‌న బాధ‌ను ఈ విదంగా వ్య‌క్త‌ప‌రుస్తుందా? అనే అనుమానం రాక‌మాన‌డం లేదు. తాజాగా స‌మంత త‌న ఇన్‏స్టా లో ఓ ఆసక్తికర కోట్‌ని షేర్ చేసింది. “గుర్తు పెట్టుకోండి..ఇక మంచి జరగబోతుంది” అని రాసి ఉన్న ఫొటోను తన ఇన్స్టా స్టోరీలో పెట్టుకుంది. దీంతో సమంత పోస్ట్ నెట్టింత వైరల్ గా మారింది.

స‌మంత‌- చైతూలు నాలుగేళ్ల వివాహ బంధాన్ని రీజ‌న్ చెప్ప‌కుండా ఎండ్ కార్డ్ వేశారు. వీళ్లు చెప్పలేదు.. వీళ్ల పెద్ద వాళ్లు చెప్పే సాహసం చేయలేదు. ఆ తరువాత సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికి..అవి ఏమి పట్టించుకోకుండా..త‌న ప‌నిలో తాను బిజీ అయిపోయారునాగ చైతన్య. కానీ స‌మంత మాత్రం ఏదో ర‌కంగా త‌న బాధ‌ను వ్య‌క్త ప‌రుస్తుంది. తన ఇన్ స్టా లో ఘాటైన పోస్ట్లు పెట్టుకొస్తుంది. ఇక స‌మంత సినిమాల విష‌యానికి వ‌స్తే.. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తయి.. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version