నియోజకవర్గ ప్రజల కోసం ఆరు అంబులెన్స్ లు కొన్న తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్యే…!

-

తన నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న కష్టాలు చూసి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముందుకు వచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గానికి తన సొంత ఖర్చు తో ఆరు అంబులెన్స్ సమకూర్చేందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మూడు రోజుల్లో మండలానికి ఒకటి చొప్పున నాలుగు, సంగారెడ్డి, సదాశివపేట మునిసిపాలిటీలకు ఒక్కోటి చొప్పున ఎమ్మెల్యే అందిస్తారు.

ఇప్పటికే గాంధీభవన్ కు మూడు అంబులెన్స్ లు విరాళంగా ఇచ్చారు. నియోజకవర్గంలో కోవిడ్ లేదా ఇతర ఎమర్జెన్సీ ఉన్నవారు ఎవరైనా ఉచిత అంబులెన్స్ సర్వీస్ ను ఉపయోగించుకోవాలి అని సూచించారు. ఈ అంబులెన్స్ సర్వీస్ 24 గంటలో అందుబాటులో ఉంటుంది అన్నారు. ఎంత రాత్రైనా, ఏ గ్రామం నుండైన టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుంది అని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news