సికింద్రాబాద్‌-రాయ్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ 3 రోజులు రద్దు

-

సికింద్రాబాద్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌కు రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ మూడు రోజుల పాటు రద్దయ్యింది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే పనుల కారణంగా ఈ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. సికింద్రాబాద్‌-రాయ్‌పుర్‌ (12771) ఎక్స్‌ప్రెస్‌ 8, 10, 12వ తేదీల్లో, రాయ్‌పుర్‌-సికింద్రాబాద్‌ (12772) ఎక్స్‌ప్రెస్‌ 9, 11, 14వ తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండదు.

త్రివేండ్రం-సికింద్రాబాద్‌ (17229) ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణ వేళల్ని రైల్వేశాఖ మార్చింది. త్రివేండ్రం నుంచి ఉదయం 6.45 గంటలకు బదులుగా 10.15 గంటలకు ఈ రైలు బయల్దేరుతుంది. ఈ నిర్ణయం ఆగస్టు 8 నుంచి సెప్టెంబరు 7 వరకు (ఆదివారాలు మినహా) అమల్లో ఉంటుందని దక్షిణ మధ్య.రైల్వే తెలిపింది.

ప్రయాణికులు ఈ విషయం గమనించి తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని లేదా.. ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. అంతరాయానికి చింతిస్తున్నట్లు తెలిపింది. మూడ్రోజుల్లో మళ్లీ సికింద్రాబాద్-రాయ్ పుర్ ఎక్స్ ప్రెస్ సేవలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version