ఓటు వేసే విషయంలో తప్పిదం పై క్లారిటీ ఇచ్చిన సీతక్క

-

నేడు భారత రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్లో ఓటు వేయడంలో పొరపాటు చేశారు అంటూ వార్తలు వచ్చాయి. విపక్ష పార్టీల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు బదులు పొరపాటున ఎన్డీఏ బలపరిచిన ద్రౌపది ముర్ము కు ఆమె ఓటు వేశారని, ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఫోటోపై క్లిక్ చేశారు అంటూ వార్తలు వెలువడ్డాయి.

అయితే ఈ వార్తలపై ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. తాను ఓటు సరిగానే వేశానని, వారు అనుకున్న అభ్యర్థికే ఓటు వేశానాని తెలిపారు. అయితే బ్యాలెట్ పేపర్ పై పెన్ మార్క్ పడిందని చెప్పారు. దీంతో ఓటు చెల్లుబాటు అవుతుందో లేదో అని ఇంకో బ్యాలెట్ పేపర్ అడిగానని తెలిపారు సీతక్క.

Read more RELATED
Recommended to you

Exit mobile version