కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు…: వైఎస్ షర్మిల

-

YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వం నిత్యం విమర్శలు చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి కేసీఆర్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడింది. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అవినీతి చేసిందని ఆరోపించింది. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ లో దాదాపుగా రూ. 70 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని షర్మిల తెలిపింది. కేసీఆర్ బంగారు తెలంగాణ తెస్తుందని మాయమాటలు చెప్పి ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పంగా మార్చాడని షర్మిల కామెంట్ చేసింది. రాష్ట్రము అంతటా లిక్కర్ దొంగలే తిరుగుతున్నారని…. తెలంగాణ లో లిక్కర్ మాఫియాను దర్జాగా కొందరు రాజకీయ నాయకులు నడిపిస్తున్నారని BRS ప్రభుత్వంపై మండిపడ్డారు.

కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా ప్రతి ఒక్కరి మీద లక్షన్నర రూపాయల అప్పును పెట్టాడని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news