తాడిపత్రిలో వైఎస్ షర్మిల ఉద్యోగ దీక్ష.. కాసేపట్లో

-

హైదరాబాద్: తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర సమస్యలపై ఆమె దృష్టిసారించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధానంగా నిరుద్యోగ సమస్య ఉంది. దీంతో ఆమె నేటి నుంచి ఉద్యోగ దీక్ష చేయనున్నారు. ఉద్యోగం రాలేదని వనపర్తి జిల్లాకు చెందిన నిరుద్యోగి కొండల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండల్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. అనంతరం తాడిపత్రిలో షర్మిల దీక్ష చేపట్టనున్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకులు బాగుపడతాయనుకుంటే నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని షర్మిల ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉందని షర్మిల డిమాండ్ చేశారు. ఉద్యోగం కోసం మంత్రి నిరంజన్‌రెడ్డి చుట్టూ వనపర్తి జిల్లా నిరుద్యోగి కొండల్‌ పదే పదే తిరిగి విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె పేర్కొన్నారు. మంత్రి మొసలికన్నీరు కారుస్తూ కొండల్‌‌కు టుంబాన్ని పరామర్శించలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండల్ కుటుంబాన్ని ఆమె పరామర్శించి ఉద్యోగదీక్ష చేపడతారు.

Read more RELATED
Recommended to you

Latest news