కాళేశ్వరం KCRకు ATM..చర్యలేవి మోడీ సారు ? – షర్మిల

-

కాళేశ్వరం KCRకు ATM..చర్యలేవి మోడీ సారు ? అని వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో…మోడీ పోస్టర్లను విడుదల చేశారు షర్మిల. మెగాస్కాం కాళేశ్వరంతో రూ.వేల కోట్లు వెనకేసుకున్న కమిషన్ రావు అండ్ కో మీద చర్యలేవి? “కాళేశ్వరం KCRకు ATM. కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టిండు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగింది” అని గప్పాలు కొట్టే బీజేపీ పెద్దలు ఎందుకు ఎంక్వైరీ చేయించడం లేదు? అని ఈ సందర్బంగా నిలదీశారు.


దేశంలోనే అతి పెద్ద స్కామ్ కాళేశ్వరం.దీనిపై మోడీ గారు స్పందించాలి. ప్రజల సొమ్ము తిన్న KCR నిగ్గు తేల్చాలి. కాళేశ్వరం అవినీతి మీద విచారణ ఎప్పుడు PM sir? అని నిప్పులు చెరిగారు. కాళేశ్వరం నీళ్ళు KCR ఫామ్ హౌస్ కి పోతున్నాయి తప్ప రైతుల పొలాలకు మాత్రం పోవడం లేదు. సింగరేణి కార్మికులకు ఇండ్ల పట్టాలు ఇస్తానని, రూ.10లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తానని KCR మోసం చేశాడు. సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటాలు, ఇండ్ల పట్టాలు ఇచ్చిన ఏకైక నాయకుడు YSR అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news