అర్జెంటుగా ఉమ్రాన్ మాలిక్‌ను టీమిండియాలోకి తీసుకోండి: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్

-

ఉమ్రాన్‌ మాలిక్ ను అర్జెంట్‌ గా టీమిండియాలోకి తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కోరారు. ఐపీఎల్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కు ప్రాతి నిధ్యం వహిస్తున్న శ్రీ నగర్‌ కు చెందిన ఉమ్రాన్‌ మాలిక్ పై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ప్రశంసలు కురిపించారు. అతడిని వీలైనంత త్వరగా టీమిండియాలోకి తీసుకోవాలని కోరారు. అతడిలో రక్తం ఉరకలెత్తుతోందని.. అతడో అద్భుతమైన ప్రతిభావంతుడని పేర్కొన్నారు.

టీమిండియాలో అతడికి చోటు కల్పించి.. ఇంగ్లండ్‌ తీసుకెళ్తే.. ఆంగ్లేయులను బెంబేలెత్తిస్తాడంటూ.. ట్వీట్‌ చేశారు. పంజాబ్‌ తో జరిగిన మ్యాచ్‌ లో ఉమ్రాన్‌ మాలిక్‌ అద్భుత స్పెల్‌ తో ఇరగదీశాడు. చివరి ఓవర్‌ లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే మూడు వికెట్లు తీశాడు. మొత్తంగా నాలుగు వికెట్లు తీసిన ఈ స్పీడ్‌ స్టార్‌ కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. అంతేకాదు.. చివరి ఓవర్‌ లో మెయిడెన్‌ వేసిన నాలుగో బౌలర్‌ గా ఉమ్రాన్‌ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో ఉమ్రాన్‌ కంటే ముందు పఠాన,్ మలింగ, ఉనద్కత్‌ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version