కరీంనగర్ లో బీజేపీకి షాక్..టీఆర్‌ఎస్‌ లోకి ఇద్దరు కార్పొరేటర్లు జంప్‌

-

కరీంనగర్ జిల్లా : కరీంనగర్ లో బిజెపి పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బిజెపి పార్టీ నుండి టీఆరెస్ లో ఇద్దరు కార్పొరేటర్ లు చేరబోతున్నారు. తెలంగాణ మంత్రి కెటిఆర్ అద్వర్యంలో కార్పొరేటర్ మెండి శ్రీలత, నక్క పద్మ ఇద్దరు గులాబీ గూటికి రానున్నారు. మిగితా 10 మంది బిజెపి కార్పొరేటర్ ల తోనూ టీఆరెస్ నాయకుల చర్చలు జరుపుతున్నారు.

రేపు మంత్రి కేటీఆర్‌ కరీంనగర్‌ రానున్నారని.. అప్పుడే కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌ లో చేరే ఛాన్స్‌ ఉందన్నారు మంత్రి గంగుల కమలాకర్‌ రావు. తెలంగాణ రాక ముందు నేను ఎమ్మెల్యే గా ఉన్నానని…కరీంనగర్ నగరములో ఎక్కడా అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కు నిధులు ఇవ్వాలని జీఓ ఇవ్వాలని కోరానని.. నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామన్నారు. రేపు కరీంనగర్ లో కేటీఆర్ చేతుల మీదుగా 615 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని.. శాశ్వత డ్రైనేజి కోసం 133 కోట్ల,90కోట్ల తో రోడ్ల కు భూమి పూజ కార్యక్రమం ఉంటుందన్నారు. 23 కోట్లతో కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాట్లు చేశామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news