షాకింగ్: గవర్నర్ ను వదిలేసి “ఫ్లైట్ గాన్”… !

-

నిన్న జరిగిన ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోట్ బెంగుళూరు ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఆసియా విమానం లో ప్రయాణం చేయాల్సి ఉంది. కానీ ఈయన బెంగుళూరు నుండి హైదరాబాద్ కు వెల్లాసి ఉండగా, అనూహ్యంగా ఎయిర్ ఆసియా విమానం ఈయనను వదిలేసి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. అయితే ఇలా ఎందుకు మిస్ అయ్యాడన్నది చూస్తే గహ్లోట్ VIP లాంజ్ నుండి వచ్చే లోపు విమానం వెళ్లిపోయింది. ఈ ఘటన పట్ల గవర్నర్ దగ్గర ఉన్న అధికారులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే స్పందించిన ఎయిర్ ఆసియా సంస్థ ఈ ఘటన పట్ల తప్పు మాదే అని గ్రహించి గవర్నర్ కు మరియు అధికారులకు క్షమాపణలు తెలియచేసింది. ఇలాంటి ఘటనలు బహుశా సాధారణ ప్రయాణికుల విషయంలో జరిగే అవకాశం ఉంది.

కానీ గవర్నర్ లాంటి వారి విషయంలో జరగడం నిజంగా దురదృష్టకరం. ఇకపై ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎయిర్ లైన్ మరియు ఎయిర్ పోర్ట్ స్టాఫ్ మీద ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version