విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా 125 ఎంపీల సంత‌కాలు : విజ‌య‌సాయి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని ప్ర‌యివేటీక‌ర‌ణ చేయ‌డాన్ని వ్య‌తిరేకిస్తు.. వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఎంపీల సంత‌కాల సేక‌ర‌ణ చేసిన‌ట్టు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి అన్నారు. ఈ సంత‌కాల సేక‌ర‌ణ క్యార్య‌క్ర‌మంలో విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఇప్ప‌టి వ‌ర‌కు 125 మంది ఎంపీలు సంత‌కాలు చేసిన‌ట్టు ఎంపీ విజ‌సాయి రెడ్డి ప్ర‌క‌టించారు.

కాగ విశాఖ ఉక్కు లాభాల్లో ఉంద‌ని అన్నారు. లాభాల్లో ఉన్న సంస్థ‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌డానికి వ్య‌తిరేకిస్తు.. ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టామ‌ని ఆయ‌న అన్నారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ న‌ష్టాల్లో ఉంద‌ని చెబితే.. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన‌ట్టే అని అన్నారు. ఈ పరిశ్ర‌మ న‌ష్టాల్లోంచి లాభాల బాట ప‌ట్టింద‌ని తెలిపారు. కాగ విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు నిర‌సిస్తూ.. త‌ర్వ‌ల‌నే ప్రధాన మంత్రి మోడీకి వినితి పత్రం ఇస్తామ‌ని తెలిపారు. అలాగే విశాఖ ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటీక‌ర‌ణ కాకుండా పోరాటం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని వైసీపీ ఎంపీ విజ‌యసాయి రెడ్డి ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Latest news