మ‌నిషి ఆయువు తీరే ముందు.. కనపడే సంకేతాలు ఇవే..!

-

పుట్టిన ప్రతి మనిషి కచ్చితంగా ఏదో ఒక రోజు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోవాల్సిందే ఎవరు ఎప్పుడు పుడతారు ఎవరు ఎప్పుడు చనిపోతారు అనేది మన చేతుల్లో లేదు. అయితే చనిపోయే ముందు కొన్ని సంకేతాలు కనబడతాయి. మనిషి ఆయువు తీరే ముందు కచ్చితంగా ఈ సంకేతాలు కనబడతాయట. ఆయువు తీరింది అని చెప్పడానికి మన శరీరం లో పలు సంకేతాలు లక్షణాలు కనబడుతుంటాయి.

ముఖ్యంగా మనిషి చనిపోయేటప్పుడు శక్తి స్థాయిలు పూర్తిగా తగ్గుతాయి పని చేసేందుకు అస్సలు అవ్వదు చనిపోయే ముందు తీవ్రమైన నీరసం అలసట ఉంటుంది. శరీరం అంటేనే భారంగా అనిపిస్తుంది. అలానే చనిపోయే ముందు బీపీ, హార్ట్ రేట్ సరిగ్గా వుండవు. శ్వాసక్రియ కూడా సరిగ్గా ఉండదు. ఇవన్నీ కూడా పూర్తిగా పెరగచ్చు లేక పోతే తగ్గొచ్చు.

ఉష్ణోగ్రత కూడా నిమిషం నిమిషానికి మారిపోతూ ఉంటుంది. చావు దగ్గ ర లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కోమల్లో ఉన్నట్లు ఉంటారు. కళ్ళు తెరిచి అస్సలు చూడలేరు. యమ ధర్మరాజు చనిపోయిన వాళ్లకి కనబడుతూ ఉంటారట. చావు దగ్గర పడుతున్నట్లయితే ఆకలి వేయదు. దాహంగా ఉండదు. బరువు తీవ్రంగా తగ్గిపోతారు. చర్మం రంగు ఉష్ణోగ్రత కూడా చావు దగ్గర పడినప్పుడు మారుతాయి ఇలా చనిపోయే ముందు ఈ లక్షణాలు కనబడతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version