దేశంలో అతి పెద్ద మతతత్వ పార్టీ వైసీపీనే : సోము వీర్రాజు

-

దేశంలో అతి పెద్ద మతతత్వ పార్టీ వైసీపీనేనని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శలు చేశారు. స్టేక్ అంటే అభివృద్ధి-సంక్షేమమేనని.. ఏదో లబ్ది చేస్తున్నామని తమకే ఓట్లేస్తారని బొత్స భావిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతోన్న సంక్షేమం, అభివృద్ధి బీజేపీదేనని.. ఈ లెక్కన ఏపీలో బీజేపీకే ఎక్కు స్టేక్ ఉందన్నారు. జగన్ ఎక్కడైనా రొడ్డేశారా..? తన జిల్లాలో బొత్స తిరిగే రోడ్లను వేసిందే కేంద్రమని చెప్పారు.

బీజేపీని పదే పదే మతతత్వ పార్టీ అంటూ విమర్శలు చేస్తున్నారని.. దేశంలో అతి పెద్ద మతతత్వ పార్టీ వైసీపీనేనని వెల్లడించారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా చర్చిలను ప్రభుత్వ నిధులతో కట్టిస్తోన్న ఏకైక ప్రభుత్వం వైసీపీ అని.. హిందూ ప్రాంతాల్లో మసీదులను దగ్గరుండి వైసీపీ ఎమ్మెల్యేలే కట్టిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఇదేంటని ప్రశ్నించిన బీజేపీపై ముస్లింలను రెచ్చగొడుతున్నారని.. హనుమాన్ యాత్రపై బీరు బాటిళ్లు వేసిన సంఘటనలు ఈ ప్రభుత్వంలోనే జరిగాయని విమర్శలు చేశారు. నేను చర్చికి వెళ్తాను.. నాకేం అభ్యంతరం లేదు.హిందువులు గురించి మాట్లాడితే మతతత్వమా..?అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news