ఆసుపత్రి నుంచి డిశార్జైన సోనియా గాంధీ..

-

ఇటీవల కరోనా బారిన పడిన కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేటి సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చా్ర్జ్‌ అయ్యారు. ఇటీవ‌లే క‌రోనా సోకిన నేప‌థ్యంలో చికిత్స నిమిత్తం ఆమె ఢిల్లీలోని స‌ర్ గంగారాం ఆసుప‌త్రిలో చేరారు సోనియా గాంధీ. వారం రోజుల పాటు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్న సోనియా గాంధీ క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఆమెను ఆసుప‌త్రి వైద్యులు సోమ‌వారం సాయంత్రం డిశ్చార్జీ చేశారు.

కాసేప‌టి క్రితం సోనియా గాంధీ ఆసుప‌త్రి నుంచి త‌న నివాసానికి చేరుకున్నారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీకి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ స‌మ‌న్లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈడీ స‌మ‌న్లు అందుకున్నాకే సోనియా గాంధీ క‌రోనా బారిన ప‌డ్డారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలే ఉన్నా… వ‌య‌సు రీత్యా నెల‌కొన్న అనారోగ్య స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో ఆమెను స‌ర్ గంగారామ్ ఆసుప‌త్రికి త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news