అసెంబ్లీ ఆవరణలో జెండా ఎగురవేసిన స్పీకర్

-

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అసెంబ్లీలోని శాసనసభ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

స్పీకర్ పోచారం

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తన నివాసం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాంతత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రంలో ప్రతిఒక్కరి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version