వచ్చే IPL సీజన్​లో ధోనీ ఆడతాడా.. CSK సీఈవో సమాధానం ఏంటంటే..?

-

ప్రస్తుతం ఐపీఎల్​దే హవా అంతా. అయితే ఈ ఐపీఎల్​లోనూ ఏ టీమ్​ల మధ్య మ్యాచ్ జరిగినా మహేంద్ర సింగ్ ధోనీ నామస్మరణ జరగాల్సిందే. ఏ స్డేడియమైనా ధోనీ ధోనీ అనే పేరుతో దద్దరిల్లాల్సిందే. అయితే ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. కానీ దీనిపై ధోనీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా ధోనీ వచ్చే ఐపీఎల్ సీజన్​లో ఆడతాడా లేదా అనే దానిపై సీఎస్కే టీమ్ సీఈవో మాట్లాడారు. ఇంతకీ అయన ఏం చెప్పారంటే..?

ఆదివారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ జరిగింది. ఇందులో సీఎస్‌కే ఓటమిపాలైంది. కానీ, అభిమానులు మాత్రం ఎలాంటి నిరుత్సాహానికి గురికాకుండా తమ జట్టుకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో మరోసారి ధోనీ రిటైర్‌మెంట్‌పై చర్చకు తెరలేసింది. చెన్నై ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్‌ ధోనీ గురించి కీలక విషయం తెలియజేశాడు.

‘‘వచ్చే సీజన్‌లోనూ ధోనీ తప్పకుండా ఆడతాడనే నమ్మకం మాకుంది. అభిమానులు ఎల్లవేళలా ఇలానే మద్దతుగా నిలవాలని కోరుతున్నా’’ అని సీఈవో వెల్లడించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version