టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

-

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా పుణెకి చేరుకున్న విష‌యం తెలిసిందే. ఇక నేటి నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇక్కడి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీం ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో విజయం సాధించిన జోష్‌లో భారత్ ఈ మ్యాచ్ బరిలోకి దిగుతోంది.

ఇది కెప్టెన్ విరాట్ కోహ్లీకి 50వ మ్యాచ్‌ కావడం మరో విశేషం. ఇక ఈ టెస్ట్‌లో విజయం సాధించాలని సఫారీలు పట్టుదలతో ఉన్నారు. అయితే ఈ మ్యాచ్‌లో టీం ఇండియా ఒక మార్పు చేసింది. హనుమ విహారీ స్థానంలో ఉమేశ్ యాదవ్‌ని జట్టులోకి తీసుకుంది. ఇక డెన్ పీడిట్ స్థానంలో అన్రిచ్ నోర్జ్టేని సఫారీలు జట్టులోకి తీసుకున్నారు.

జట్ల వివరాలు:
భారత్: మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఇశాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ.

సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్, ఎయిడెన్ మార్క్‌రమ్, థెయునిస్ డి బ్రెయిన్, తెంబా బావుమ, డుప్లెసిస్(కెప్టెన్), క్వింటన్ డి కాక్(కీపర్), సెనురన్ ముత్తుస్వామి, వెర్నార్ ఫిలాందర్, కేశవ్ మహారాజ్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్టే.

Read more RELATED
Recommended to you

Latest news