IND vs AUS : మొదటి టీ20లో బుమ్రా ఆడక పోవడానికి కారణం ఇదే !

-

తొలి మ్యాచ్ లో ​ఇండియాపై విజయం సాధించింది ఆస్ట్రేలియా. నాలుగు వికెట్ల తేడాతో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో భారత జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. జట్టు సమష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఆడలేదు.

అతడు ఆడి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. అయితే బూమ్రా ఆడక పోవడానికి గల కారణాలను మ్యాచ్ టాస్ సందర్భంగా రోహిత్ శర్మ వివరించారు.  గాయం నుంచి కోలుకొని ఈ సిరీస్ కు ఎంపికైన టీమిండియా స్టార్ పెసర్ జస్ట్ ప్రీత్ బూమ్రా ఈ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతను స్వల్ప గాయంతో బాధపడుతున్నాడని, గేమ్ బ్రేక్ తీసుకుంటున్నాడని, రెండో టీ20 లేదా మూడో టి20 లో బరిలోకి దిగుతాడని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. రిషబ్ పంత్ ను పక్కన పెట్టి దినేష్ కార్తీక్ ను తీసుకున్నామని, అక్షర పటేల్, చాహల్ తో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. ‘మా సత్తాను పరీక్షించుకునేందుకు ఇదో మంచి అవకాశం. ప్రతి మ్యాచ్ ఓ గుణపాఠం నేర్పుతుందని రోహిత్ శర్మ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news