నిరాశ పరిచినందుకు క్షమించండి – విరాట్‌ కోహ్లీ ఎమోషనల్‌ పోస్ట్‌

-

నిరాశ పరిచినందుకు క్షమించండంటూ టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. గురువారం ఇంగ్లాండ్​తో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్​ సెమీఫైనల్ మ్యాచ్​లో భారత ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియాపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

అటు కెప్టెన్​ రోహిత్​ శర్మ, స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ, స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ క్రమంగా టీ20 జట్టుకు దూరమవుతారని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

ఈ నేపథ్యంలో.. ఓటమిపై క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. మేము ఆస్ట్రేలియన్ తీరాలకు వెళ్లి..ఇండియన్స్‌ కలను సాకారం చేయలేకపోయాం. ఇది నిజంగా నిరాశనే. స్టేడియాలలో మాకు మద్దతు ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో హాజరైన మా అభిమానులందరికీ ధన్యవాదాలు. ఈ జెర్సీని ధరించి, మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఎల్లప్పుడూ గర్వంగా భావిస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news