ముగిసిన SRH బ్యాటింగ్.. గుజరాత్‌ ముందు భారీ లక్ష్యం

-

ఐపీఎల్ సీజన్ 2022లో మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే ఈ రోజు ముంబాయి వాంఖడే స్టేడియం వేదికగా ఆరెంజ్ ఆర్మీతో గుజరాత్ టైటాన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. అయితే టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌నైజర్స్‌ అభిషేక్‌ శర్మ (42 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్క్రమ్‌ (40 బంతుల్లో 56; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరును గుజరాత్ ముందు ఉంచింది.

అయితే మూడో ఓవర్‌ ఐదో బంతికి స్టన్నింగ్‌ డెలివరితో కేన్‌ విలియమ్సన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. తరువాత.. సన్ రైజర్స్ త్రిపాఠి రూపంలో రెండో వికెట్ ను.. మూడో వికెట్ రూపంలో అభిషేక్‌ శర్మ, నాలుగో వికెట్ రూపంలో పూరన్‌, 18వ ఓవర్‌ ఆఖరి బంతికి యశ్‌ దయాల్‌ బౌలింగ్‌లో మార్క్రమ్‌, అల్జరీ జోసఫ్‌ సూపర్‌ త్రో చేయడంతో వాషింగ్టన్‌ సుందర్‌ (3) రన్నౌట్ అయ్యి పెవిలియన్ చేరారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version