తమిళనాడు: నీట్ పరీక్ష మినహాయింపు కోరుతూ అసెంబ్లీలో బిల్ వేస్తున్న స్టాలిన్ ప్రభుత్వం

-

తమిళనాడుకు చెందిన 19ఏళ్ల పిల్లవాడు నీట్ పరీక్షకు హాజరు కాకుండా వాళ్ళింట్లో శవమై కనిపించాడు. తమిళనాడూలోని సేలంలో జరిగిన ఈ సంఘటన ప్రకంపనలు సృష్టిస్తుంది. మూడవసారి పరీక్షకు సిద్ధమైన పిల్లవాడు, పరీక్షలో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. ఐతే ప్రస్తుతం ఈ అంశం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చ రేపుతుంది. నీట్ పరీక్ష నుండి తమిళనాడుని మినహాయించాలని కోరుతూ, శాసనసభలో బిల్ వేయనున్నారు.

ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బిల్ కి రాష్ట్రపతి సమ్మతం కావాలని తమిళనాడు ప్రభుత్వం కోరుకుంటుంది. నీట్ పరీక్ష కారణంగా ఇదివరకే వైద్య విభాగంలో ఆసక్తి ఉన్న కొంతమంది విద్యార్థులు తమ ప్రాణాలను బలి తీసుకున్నారని, అందువల్ల తమిళనాడును నీట్ నుండి మినహాయించాలని అంటున్నారు. మరి ఈ బిల్ కి రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందో లేదో చూడాలి. 2017లో కూడా తమిళనాడు ప్రభుత్వం నీట్ వద్దని కోరుతూ బిల్ ప్రవేశ పెట్టింది. కానీ, దానికి రాష్ట్రపతి ఆమోదం లభించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version