ఆ రూమర్స్ పై గట్టి కౌంటర్ వేసి రష్మిక పరువు తీసేసిన స్టార్ క్రికెటర్ శుబ్‌మన్..

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పాన్ ఇండియా హీరోగా నిలబెట్టిన పుష్ప సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం అనంతరం రష్మిక అభిమానులంతా ఆమెను నేషనల్ క్రష్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. అంతేకాకుండా స్టార్ క్రికెటర్ శుబ్‌మన్ సైతం రష్మికను తన ఫస్ట్ క్రష్ అంటూ తెలిపారని కొన్ని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించాడు ఈ క్రికెటర్..

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన. తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ సంపాదించిన ఈ భామ కిర్రాక్ పార్టీ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఛలో, సరిలేరు నీకెవ్వరు, పుష్ప, గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకుంది.

కాగా కొన్నాళ్ల క్రితం స్టార్ క్రికెటర్ శుభమగ్రిల్ రష్మికను తన క్రష్ అంటూ చెప్పాడని వార్తలు వినిపించిన అనంతరం రష్మిక నేషనల్ అయిపోయింది. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన క్రికెటర్ శుభమన్.. “నేను ఏ మీడియాతో ఈ మాట చెప్పాను. నేను ఎవ్వరితోనే ఇలా చెప్పినట్టు నాకు గుర్తులేదు. తను ఎవరో కూడా నాకు తెలీదు..” అంటూ ఇన్‌స్టాలో కామెంట్ చేశాడు.

23 ఏళ్ల ఈ స్టార్ క్రికెటర్.. సచిన్ తనయ సారా టెండుల్కర్, సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ తో ప్రామాయణం నడిపినట్టు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే సరాతో బ్రేకప్ అనంతరం సారా అలీఖాన్తో ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నాడని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.. ఈ పోస్ట్ అనంతరం ఇలా స్టార్ భామలతో ప్రేమలో మునిగి తేలుతున్న ఈ క్రికెటర్ రష్మికను తన క్రషన్ అని ఎందుకు అంటాడు అంటూ ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ పోస్ట్ తో రష్మిక పరువు పోయింది అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు..

Read more RELATED
Recommended to you

Exit mobile version