BRAKING : ఎంపీ అర్వింద్ వాహనంపై రాళ్ల దాడి..పరిస్థితి ఉద్రిక్తం

-

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం ఇస్సపల్లిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ వాహనం పై టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు రాళ్లతో దాడి చేసినట్లు సమాచారం అందుతోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల దాడిలో ఎంపీ అరవింద్‌ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళుతుండగా.. ఆర్మూర్ మండలం ఇస్సపల్లిలో దాడి చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల దాడికి నిరసనగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులకు ముందే చెప్పినా పట్టించుకోలేదని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులను అడ్డుకోవాలంటూ ఆర్మూర్‌ లో ధర్నా కూడా చేసినట్లు చెప్పారు. తన కారు పై టీఆర్‌ఎస్‌ శ్రేణులు రాళ్ల తో దాడి చేసారని సీపీకి ఎంపీ ఆర్వింద్‌ కంప్లైంట్‌ చేశారు. లోక్‌ సభ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. దీంతో పాటు కేంద్ర హోం శాఖ కు కూడా ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news