ఛీ… ఛీ… కాలేజ్ అమ్మాయిలపై టీడీపీ కార్యకర్త మురళి వికృత చేష్టలు

-

ఏలూరు లోని గోపవరం కు చెందిన టీడీపీ కార్యకర్త మురళి పై విద్యార్థినుల తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా గోపవరంలో ఉన్న శ్రీచైతన్య కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలను అసభ్యంగా మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నాడట. అయితే తాజాగా ఒకమ్మాయిని మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో 20 మంది విద్యార్థులు అమ్మాయి తల్లితండ్రులకు మొత్తం విషయాన్ని చెప్పారట. దీనితో ఆగ్రహం చెందిన అమ్మాయి తల్లితండ్రులు బస్సును గోపవరం లో ఆపి మురళిని పేరెంట్స్ నిలదీసి అడిగారు.. కానీ తప్పు ఒప్పుకోకపోగా అమ్మాయి తండ్రిపై దాడికి దిగి గాయపరిచాడు. ఇక అతని దెబ్బకు భయపడిన అమ్మాయి తండ్రి తమకు రక్షణ కల్పించాలని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుని కలిశారు. ఎమ్మెల్యే అప్పారావు మురళిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పడంతో.. అమ్మాయి నుండి కంప్లైంట్ తీసుకుని పోలీసులు మురళిపై కేసును నమోదు చేశారు.

పోలీసుల రికార్డు ప్రకారం గతంలో కొన్ని కేసులలో మురళి నిందితుడిగా ఉండడంతో కేసును ఇంకా స్ట్రాంగ్ గా నమోదు చేసి తగిన శిక్ష వేయించడానికి చూస్తామని బాధితులకు చెప్పారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version