వైసీపీ నేతలు తమతో టచ్ లో ఉన్నారు : టీడీపీ అధినేత చంద్రబాబు

-

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైసీపీ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది వైసీపీ నేతలు తమతో కాంటాక్ట్ లోనే ఉన్నారని తీలిపారు ఆయన . వైసీపీలో ఉన్న నేతలు బానిసల్లా బతుకుతున్నారని అన్నారు. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని సొంత బలంతోనే గెలిపించుకున్నామని వెల్లడించారు చంద్రబాబు.
జగన్ ఒక పెద్ద దొంగ అని, ఆయన పేదల ప్రతినిధి ఎలా అవుతాడని మండిపడ్డారు అయన. జగన్ వైఖరి చూస్తే పుట్టిందే రాష్ట్ర విధ్వంసం కోసం అన్నట్టుందని అన్నారు. జగన్ భవిష్యత్ ఏంటనేది ప్రజలు అంచనా వేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. గతంలో ఏది మంచి, ఏది చెడు అనే విశ్లేషణ ఉండేదని, వైసీపీ పాలనలో ఎదురుదాడి తప్ప మరొకటి లేదని విమర్శించారు.

Many YSRC MLAs are in touch with TDP, says Chandrababu Naidu - Telangana  Today

ముందస్తు ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా లేదని జగన్ భావిస్తే అది పగటికలేనని చంద్రబాబు అన్నారు. రేపు ఎన్నికలు పెట్టినా తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చింది షాక్ ట్రీట్ మెంట్ అని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు శాశ్వత చికిత్స చేస్తారని తెలిపారు ఆయన. “ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో వారికి చెప్పాలా? 175 స్థానాల్లో వైసీపీని ఓడించడమే మా లక్ష్యం” అని చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా ఆయన వివేకా హత్యోదంతం పైనా స్పందించారు. వివేకా హత్య వ్యవహారం దేశ చరిత్రలోనే సస్పెన్స్ థ్రిల్లర్ అని అన్నారు. ఇన్ని ట్విస్టులున్న హత్య వ్యవహారం దేశంలో మరొకటి లేదన్నారు. ఫిక్షన్ కథలు రాసేవారు కూడా ఇలాంటివి రాయలేరని చంద్రబాబు అన్నారు. ఇలాంటి కేసు వీగిపోతే వ్యవస్థల మీద తమకున్న విశ్వసం పోతుందని అన్నారు చంద్రబాబు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news