BREAKING : ఈరోజు, రేపు ఢిల్లీలోనే తెలంగాణ సీఎం కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. నిన్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మూలాయం సింగ్ యాదవ్ అంతక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ నిన్న హాజరయ్యారు. ఇక ఆ కార్యక్రమం అనంతరం నేరుగా ఢిల్లీకి పయనమయ్యారు సీఎం కేసీఆర్.

ఈ సంద‌ర్భంగా ఢిల్లీలో ఇటీవ‌లే ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రాంతీయ కార్యాల‌యాన్ని ప‌రిశీలించారు సీఎం కేసీఆర్‌. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌య నిర్మాణ ప‌నులు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ భ‌వ‌న నిర్మాణం పూర్తి అయ్యే దాకా కొత్త‌గా ప్ర‌క‌టించిన బీఆర్ఎస్ కార్యాల‌యం కోసం స‌ర్దార్ ప‌టేల్ మార్గ్‌లోని ఓ భ‌వ‌నాన్ని అద్దెకు తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

బీఆర్ఎస్ ప్ర‌క‌ట‌న రోజే ఈ భ‌వ‌నానికి బీఆర్ఎస్ రంగులు అద్దారు. ఇది ఇలా ఉండగా ఈ రోజు, రేపు ఢిల్లీలోనే తెలంగాణ సీఎం కేసీఆర్.. ఉండనున్నారు. ఈ సందర్భంగా పలు పార్టీల నేతలతో భేటీ కానున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రకటన తర్వాత తొలిసారి హస్తినకు వెళ్లిన కేసీఆర్.. ఈ రోజు, రేపు ఢిల్లీలోనే ఉండనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news