తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. ముప్పు తప్పినట్లేనా..?

-

ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తన్న కరోనా రక్కసి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు భారీగా నమోదైన కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు తగ్గుతోంది. అయితే..తాజాగా తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 18,571 శాంపిల్స్ పరీక్షించగా, 255 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో 95 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 23, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17 కేసులు గుర్తించారు.

Coronavirus Update, Corona in Hyderabad, Corona In Telangana, Corona In  Andhra | The Hans India

మరో 509 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,33,776 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,27,511 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,154 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news