ఏపీ మంత్రులపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ మంత్రులపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏమీ చదువుకోని వారిని మంత్రులను చేశారని ఆరోపించారు. కనీస అవగాహన లేని వారికి మంత్రి పదవులు ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సీఎం కేసీఆర్ మాత్రం అన్ని అంశాలపై పట్టుకున్న వారికి మాత్రమే పదవులు ఇచ్చారని చెప్పారు.

శ్రీనివాస్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల మధ్య తీవ్ర దుమారం లేపే విధంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలపై ఏపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఇక అంతకుముందు ఓ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మా వెంట ఉన్నాడని.. చావడానికైనా, చంపడానికైనా సిద్ధమేనని అన్నారు. ఇక అత్యంత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా బాధ్యత రహితమైన ప్రకటనలు చేయడం ఏమిటని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version