పిచ్చి పరాకాష్టకు చేరడం అంటే ఇదే.. రక్తంతో లెటర్ రాసి..

-

ఈరోజుల్లో యువత అడ్వాన్స్ గా ఉన్నారు.. ప్రేమ, బ్రేకప్ అనేవి ఫటా ఫట్ జరిగిపోతున్నాయి.. శారీరక అవసరాలను మాత్రమే తీర్చుకునేందుకు ప్రేమను వాడుతున్నారు.. వాళ్ళ కోరికలు తీరితే గుడ్ బై చెబుతున్నారు.. ఇక విషయానికొస్తే… సాదారణంగా ప్రేమలో పడిన వాళ్ళు.. ఆమె తనకు దక్కాలని గుడికి వెళ్లి మొక్కుకోవడం కామన్. కొందరు తలనీలాలు ఇస్తారు. మరికొందరు ముడుపులు చెల్లించుకుంటారు. గుడి చుట్టూ 1000 ప్రదక్షణలు చేస్తారు..

ఇంకొందరు అన్నదానం చేస్తారు. హుండీలో కానుకలు గట్రా వేస్తారు. కానీ ఫర్ ఏ ఛేంజ్ నల్గొండ జిల్లాలో ఓ యువకుడు తన ప్రేమను గెలిపించమని ఏకంగా దేవుడికే ఉత్తరం రాశాడు. అది కూడా మాములుగా కాదండోయ్.. రక్తంతో. తామిద్దరం జీవతాంతం కలిసి ఉండేలా దీవించాలంటూ బ్లెడ్‌తో లేఖ రాసి హుండీలో వేశాడు. తాజాగా కానుకలు లెక్కించేందుకు హుండీ ఓపెన్ చేయగా..ఈ లేఖ వెలుగు చూసింది.. దాన్ని చూసిన వారంతా షాక్ కు గురవుతున్నారు..

నల్గొండ జిల్లా పెద్దగట్టు దురాజపల్లి జాతర ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఉభయ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి లింగమంతులస్వామిని స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఏటా ఐదు రోజుల ఈ జాతర జరుగుతుంది. తాజాగా ఓ భక్తుడు స్వాములోరి హుండీలో తన ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు తీసుకెళ్లాలని రక్తంతో రాశాడు. శ్రీకాంత్ అనే యువకుడి పేరుతో ఆ లేఖ ఉంది. మంగమ్మ అనే యువతి గురించి ఇలా రాసుకొచ్చాడు.. గతంలో ఓ వ్యక్తి తన బిజినెస్ పార్ట్నర్ మోసం చేసాడు.. డబ్బులను వెనక్కి తిరిగి ఇవ్వాలని వారికి కఠిన శిక్ష వేయాలంటూ వేసిన లేఖ కూడా గతంలో వైరల్ అయ్యింది.. ప్రస్తుతం ఈ లేక కూడా వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news