ఈ నెల 21న బోనాలు, 22న రంగం భవిష్యవాణి – తలసాని ప్రకటన

-

ఈ నెల 21 న సికింద్రాబాద్ లష్కర్ బోనాల ఉత్సవాలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. సికింద్రాబాద్ లోని మహంకాళి ఆలయం వద్ద అధికారులతో కలిసి పర్యటించారు MLA తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…ఈ నెల 21న బోనాలు, 22 న రంగం భవిష్యవాణి కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.

Telangana Rangam Bhavishyavani 2024

అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాదిమంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ప్రకటించింది KCR అని గుర్తు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగిందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అందరి భాగస్వామ్యం తో అత్యంత ఘనంగా బోనాల ఉత్సవాలు ఉంటాయన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version