హైదరాబాద్‌ లో మరో ప్రమాదం..స్కూల్‌ బస్సు ఢీ కొట్టి చిన్నారి మృతి

-

హైదరాబాద్‌ లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్‌ బస్సు ఢీ కొట్టి చిన్నారి మృతి చెందింది. జీడిమెట్ల – బాచుపల్లి పీఎస్‌ పరిధిలో ఓ పాపను.. స్కూల్ బస్సు ఢీ కొనడంతో మృతి చెందింది. రెడ్డిల్యాబ్స్ కంపెనీ వద్ద… కిషోర్ తన కూతురు ధీక్షిత(8) తో స్కూటీపై వెళుతూ రోడ్డు దాటుతుండగా, అతివేగంతో వచ్చిన బాష్యం స్కూల్ బస్సు వాళ్ల స్కూటీని ఢీ కొట్టింది.

దీంతో వెనుక కూర్చున్న పాప.. స్కూటీపై నుంచి కింద పడిపోయింది. ఈ తరుణంలోనే.. స్కూల్ బస్సు పాపపై నుంచి వెళ్లడంతో పాప అక్కడికక్కడే మృతి చెందింది. ఆ పాప బోరంపేటలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో మూడో తరగతి చదువుతోందని సమాచారం. బస్సు డ్రైవర్ రహీమ్ అతివేగంగా నడుపుతూ, అతని నిర్లక్ష్యమే పాప మృతికి కారణంగా తెలిపారు బాచుపల్లి సిఐ సుమన్. ఇక ఈ సంఘటనపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version