30 వేలకు మూడేళ్ల కొడుకుని అమ్మిన తల్లి!

-

సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో ఓ కన్నతల్లి చేసిన నిర్వాకంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.కొడుకును అమ్మేసి.. కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.30వేల రూపాయలకు మూడేళ్ల కొడుకుని అమ్మేసింది ఓ తల్లి.భర్తకు దూరంగా మూడేళ్ల కొడుకుతో కలిసి ఉంటున్న శ్రీలత (32)ఈ నెల 1న తన మూడేళ్ల కొడుకును రోడ్డుపై కొట్టింది.

అదే సమయంలో అటుగా వెళ్తున్న చాంద్ హసన్ అనే మెకానిక్ బాలుడిని ఎందుకు కొడుతున్నావంటూ ప్రశ్నించగా, నా కొడుకు..నా ఇష్టం అంటూ చెప్పింది శ్రీలత (బాలుడి తల్లి).నీకు ఇష్టం లేకుంటే ఎవరికైనా ఇచ్చేయ్.. అందుకు డబ్బులు ఇస్తారని చెప్పాడు మెకానిక్ హసన్.దింతో కొడుకును విక్రయించ డానికి సిద్ధమైన శ్రీలత ఈ నెల 2న జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హైదరాబాద్ కు చెందిన మెకానిక్ హసన్ అతడి భార్య సనాబేగంలకు కొడుకును 30వేలకు విక్రయించింది.ఈ వ్యవహారాన్నంతా తన సెల్ఫోన్లో వీడియో రికార్డ్ చేశాడు మెకానిక్ హసన్.

ఆ తర్వాత హైదరాబాద్కు చెందిన ఓ మెకానిక్ తనను కత్తితో బెదిరించి తన కొడు కును కిడ్నాప్ చేశాడంటూ సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రీలత(బాలుడి తల్లి).దీంతో రంగంలోకి దిగిన సంగారెడ్డి రూరల్ పోలీసులు పలు బృందాలతో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టి హైదరాబాద్లోని ఎల్బీనగర్ లో బాలుడు ఉన్నట్టు గుర్తించారు.వెంటనే మెకానిక్ దంపతులతో పాటు బాలుడిని శనివారం సంగారెడ్డి పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు.

వడ్డె శ్రీలతను బెదిరించడం, బాలుడిని కిడ్నాప్ చేయడం అవాస్తవమని పోలీసుల విచారణలో నిర్దారణ అయింది.తప్పుడు ఫిర్యాదు చేసినందుకు శ్రీలతపై, బాలుడిని కొనుగోలు చేసినందుకు మెకానిక్ దంపతులు హసన్-సనాబేగంలపై కేసు నమోదు చేసి,బాలుడిని సంగారెడ్డిలోని శిశుగృహకి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news